ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి, కల్తీ మద్యం విచ్చలవిడిగా లభ్యమవుతుండటమే మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి ఋషిక ప్రియపై అత్యాచారం, హత్య వంటి అఘాయిత్యాలకు కారణమని మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దేశ తిప్పారెడ్డి ఆరోపించారు.
గురువారం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిలతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో గంజాయి, కల్తీ మద్యం విక్రయాలను వెంటనే అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
