Home South Zone Andhra Pradesh అపామ్స్ 2.0 తో రైతులకు చేరువగా ప్రభుత్వ సేవలు: జేడీ కీలక ఆదేశాలు.

అపామ్స్ 2.0 తో రైతులకు చేరువగా ప్రభుత్వ సేవలు: జేడీ కీలక ఆదేశాలు.

0

రైతులు అందరూ అపామ్స్ 2.0 (APAMS 2.0) మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ పంటల వివరాలను నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు (జేడీ) విజయకుమార్ సూచించారు.
శనివారం కాకినాడ జిల్లా వాకాడ ప్రాంతంలో రబీ పంటల పరిస్థితిని ఆయన పరిశీలించారు. పంటల్లో కనిపిస్తున్న తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు మార్గదర్శకాలు ఇచ్చారు. పంటల సంరక్షణలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రభుత్వం అందిస్తున్న వివిధ వ్యవసాయ పథకాల ప్రయోజనాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా 11 అంకెల రైతు గుర్తింపు సంఖ్య (Farmer ID) పొందాలని తెలిపారు. రైతులు తమ పంటల వివరాలను అపామ్స్ 2.0 యాప్‌లో నమోదు చేస్తే ప్రభుత్వానికి సరైన సమాచారం అందుతుందని, దాని ద్వారా పథకాల అమలు సులభమవుతుందని వివరించారు.
రైతులు వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ సూచనలు పాటించాలని ఆయన కోరారు.

NO COMMENTS

Exit mobile version