మదనపల్లిలో ఆదివారం జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిలో మహిళలకు విశిష్ట స్థానం ఉందని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.
మహిళల భద్రత కోసం ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ధీరజ్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు రూ. 2190. 24 కోట్ల మెగా చెక్కును పంపిణీ చేశారు. వివిధ రంగాల్లో రాణించిన మహిళా అధికారులను, ఎన్జీవోలను ఘనంగా సత్కరించారు.
