అంబేద్కర్ జయంతి వేడుకలు: భవనం, విగ్రహ ఏర్పాటుపై పోరాటం కొనసాగింపు

0
2

చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలంలోని నల్లూరుపల్లి గ్రామంలో ఆదివారం, 12 ఏప్రిల్ 2026న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ముందస్తు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూజలు చేసి, జెండా పతకాన్ని ఎగరవేశారు. ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకరప్ప మాట్లాడుతూ, అంబేద్కర్ గారి భవనం, విగ్రహ ఏర్పాటు కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్నామని, అది ఇంకా నెరవేరలేదని తెలిపారు. రెవెన్యూ అధికారులు, దళిత సంఘాల నాయకులు, గ్రామ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .