*ఏపీలో నేడు 51 మండలాల్లో తీవ్ర వడగాలులు*
అమరావతి :
ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నేడు 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 49 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. ఆదివారం కడప జిల్లా పొట్టిపాడులో అత్యధికంగా 43.8°C ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఎండలో బయటకు రావద్దని అధికారులు సూచించారు.










