*ఏపీలో ’11 గంటల వరకే ఒంటిపూట బడులు’*
అమరావతి :
ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలల పనివేళలు మార్చాలని విద్యాశాఖను మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ కోరింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 43-45 డిగ్రీలకు చేరుతుండటంతో, విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఉదయం 11 గంటల వరకే ఒంటిపూట బడులు నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఉండనున్నాయి.










