‘అంబేద్కర్ ఆశయాలకు నేతల కృతజ్ఞత నివాళి.|

0
15

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  ఘనంగా నివాళులు అర్పించారు. కొత్తబస్తీ సర్కిల్ మరియు ఓల్డ్ ఆల్వాల్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  పాల్గొని అంబేద్కర్  ఆశయాలను గుర్తు చేశారు. సమాజంలో సమానత్వం, న్యాయం సాధనకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ గారి సిద్ధాంతాలను కొనసాగించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.

#sidhumaroju

Alwal