మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. కొత్తబస్తీ సర్కిల్ మరియు ఓల్డ్ ఆల్వాల్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ ఆశయాలను గుర్తు చేశారు. సమాజంలో సమానత్వం, న్యాయం సాధనకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ గారి సిద్ధాంతాలను కొనసాగించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.
#sidhumaroju
Alwal










