జలధార ప్రాజెక్టుపై కేంద్ర బృందం అన్నమయ్య జిల్లాలో పర్యటన.

0
2

జలధార ప్రాజెక్టుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర భూగర్భ జల బోర్డు ఇంజనీర్లతో కూడిన బృందం ఈనెల 16న అన్నమయ్య జిల్లాకు రానుంది. కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో విజయవంతంగా అమలు అవుతున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తోంది. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసే దిశగా అధ్యయనం చేపట్టేందుకు ఈ బృందం 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటించి ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించనుంది.