అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా, ఘనంగా నివాళులు అర్పించిన: ఎంపీ

0
4

సుల్తానాబాద్‌కు చేరుకున్న ఎంపీ వంశీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు భారతదేశం ఆదర్శ దేశంగా నిలుస్తోందని పేర్కొన్నాను.

అంబేద్కర్ గారు దళితులకు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి వర్గానికి స్ఫూర్తి ప్రదాత అని, దళితుల హక్కుల కోసం ఆయన చేసిన కృషి అపారమని, రాజ్యాంగంలో వారికి భద్రత కల్పించారని పేర్కొన్నారు .

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.