In loksabha seats to increase.

0
2

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జీఎస్‌డీపీ (GSDP) ఆధారిత హైబ్రీడ్ మోడల్‌లో జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య వ్యత్యాసం పెరుగుతుందని హెచ్చరించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలుపుతూనే, డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం మరియు నిపుణుల కమిటీని నియమించాలని కోరారు. దేశాభివృద్ధికి ఆర్థికంగా తోడ్పడుతున్న రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యతనివ్వాలని, ఏకపక్ష నిర్ణయాలు దేశ సమగ్రతకు ప్రమాదకరమని స్పష్టం చేశారు.