మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఓల్డ్ అల్వాల్లోని అంబేద్కర్ విగ్రహానికి అల్వాల్ పిఎస్. ఎస్హెచ్ఓ ప్రశాంత్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
“డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి అపార సేవలు అందించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అపూర్వం. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఆయన పాఠాలు చెబుతున్నాయి. అంబేద్కర్ గారి ఆలోచనలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొని అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించారు.
#sidhumaroju
Alwal










