భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా చీరాలలోని ముక్కోణపు పార్క్ వద్ద ఆయన విగ్రహానికి చీరాల జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి అంబేద్కర్ సిద్ధాంతాలు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన మహత్తర సేవలను స్మరించుకున్నారు.
అనంతరం చీరాల పట్టణంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీగా సాగారు. “అంబేద్కర్ ఆశయాలు వర్థిల్లాలి – సమానత్వ సమాజం స్థాపించాలి” అంటూ నినాదాలు చేస్తూ కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు ఎస్వీ కృష్ణారెడ్డి, దగ్గుబాటి రాంబాబు మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గం సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. విద్య, సమాన హక్కులు, సామాజిక న్యాయం సాధనలో ఆయన సిద్ధాంతాలు నేటి తరానికి దిక్సూచిగా నిలుస్తాయని తెలిపారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.
అనంతరం చీరాలలోని ఏరియా ఆసుపత్రిని సందర్శించిన జర్నలిస్టులు రోగులకు, బాలింతలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాల నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం చీరాల జర్నలిస్టుల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మళ్ళా చంద్రశేఖర్, నక్కల రమేష్, కట్టేడి వాసు, దేవరపల్లి దిలీప్ కుమార్, నీరుకట్టు బద్రి, గుడిమోటి అశోక్ కుమార్, కృష్ణ చైతన్య, దేవరపల్లి దిలీప్,షేక్ సుభాని, చినబాబు, వడ్లమూడి సాయి, బత్తులు వెంకయ్య, సాజిద్ ఆలీ, షేక్ మస్తాన్ వలి,కాగితా శేఖర్ బాబు, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.










