నిజామాబాద్: 27 వ డివిజాన్ లో చలివేంద్రం ప్రారంభం

0
1

నిజామాబాద్:ఈరోజు 27వ డివిజన్ వర్ని చౌరస్తాలో ఖిల్లా రామ్ మందిర్ ప్రధాన కార్యదర్శి కల్పే చిరంజీవి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ స్టేట్ సెక్రటరీ శ్రీమతి గోపిడి స్రవంతి రెడ్డి గారు, అలాగే 27వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కల్పే అర్చన గారు హాజరై రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ మహిపాల్ గారు మరియు భక్త హిందూ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

ఇలాంటి సేవ కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే కల్పే చిరంజీవి గారిని శ్రీమతి స్రవంతి రెడ్డి గారు అభినందించి, మరింతగా ప్రోత్సహించారు.