ప్రజల ఆరోగ్యమే మా ప్రాధాన్యత : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సౌమ్య

0
1

చెవిటికల్లులో 36 లక్షలతో వెల్నెస్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన

కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామంలో మంగళవారం నాడు 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం కాబోతున్న వెల్నెస్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య  కూటమి నేతలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేశారు. గ్రామస్థుల ఆరోగ్య సంరక్షణకు మైలురాయిగా భావించే ఈ వెల్నెస్ హెల్త్ సెంటర్ నిర్మాణం ద్వారా స్థానికులకు ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య  తెలిపారు. “ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యత. ఈ కేంద్రం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్యులు సులభంగా వైద్య సేవలు పొందేందుకు అనువైన వేదిక అందుతుంది” అని ఆమె అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు,కూటమి నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ శంకుస్థాపన కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కేంద్రం త్వరలోనే పూర్తి కావడంతో గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.