శ్రీరాంపూర్ : మంచిర్యాల పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఈరోజు ఉదయం శ్రీరాంపూర్లోని ప్రగతి స్టేడియంలో మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన స్థానికులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ప్రజల ఆరోగ్యం పట్ల తన కట్టుబాటును మరోసారి చాటుతూ, ప్రతి ఒక్కరూ రోజూ వ్యాయామం చేయాలని సూచించారు. యువత క్రీడల వైపు మొగ్గు చూపితే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమని తెలిపారు.
స్థానికులు ఎంపీ గారి సరళతను, అందుబాటులో ఉండే నాయకత్వాన్ని ప్రశంసించారు.అనంతరం వంశీకృష్ణ గారు ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతూ కొంత సమయం గడిపారు.










