ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

0
7

చిలుకూరు ఏప్రిల్ 2
ఐదు సంవత్సరముల లోపు బాలలు కల్మషం లేని వారని దేవుళ్ళ తొ సమానం అని చిలుకూరు అంగన్వాడీ కేంద్రం 4 నందు జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి జి నరసింహారెడ్డి అన్నారు.

నేటి ఈ స్ఫూర్తితో భవిష్యత్తు అంతా బంగారు బాట కావాలని మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సిరికొండ కవిత, ఆయా పుల్లమ్మ బాల బాలికలు వారి తల్లులు పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు.