నిజమైన అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనే సాధ్యం – ఎమ్మెల్యే కొండయ్య

0
1

చీరాల నియోజవర్గం చీరాల పట్టణం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో చీరాల పట్టణ అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం ఏర్పాటు నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథ చీరాల ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏకంగా ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే సొంతమని, హైదరాబాద్ ప్రజలు ఆయనకి ఇప్పటికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉన్నారని, ఇలాంటి ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.