మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన డివిజన్ సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల సాగర్ రావు కృషితో పాత వేంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నూతన ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.*
ఈ సమావేశంలో మేయర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కార్పొరేషన్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని , ఎమ్మెల్యే కృషితో త్వరలోనే ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మేయర్ తెలియచేశారు.15 వ డివిజన్ లో కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లు వేగవంతంగా పూర్తవుతున్నాయని,రానున్న రోజుల్లో శాసన సభ్యుల సహకారంతో మరిన్ని ఇళ్లు మంజూరు అవుతాయని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు స్థానిక కార్పొరేటర్ చింతపండు శ్రీనివాస్ ,మాజీ సర్పంచ్ గోనె సంజయ్ కుమార్ ,మాజీ ఉప సర్పంచ్ తిరుపతి,కాంగ్రెస్ యువ నాయకులు నార్ల మహేందర్,వార్డు స్పెషల్ ఆఫీసర్ శంకర్,హౌసింగ్ బోర్డు ఏఈ చందు,స్థానిక కాంగ్రెస్ నాయకులు,డివిజన్ ప్రజలు పాల్గొన్నారు










