మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సురక్షితమైన ప్రయాణం మరియు పచ్చదనం పరిరక్షణే లక్ష్యంగా అల్వాల్లో చేపట్టిన మూడు భారీ వృక్షాల మార్పిడి ప్రక్రియ విజయవంతమైంది. దీనిపై ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు అందించిన పూర్తి వివరాలు మీకోసం…
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు రహదారి భద్రతలో భాగంగా టెంపుల్ అల్వాల్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఆటంకంగా ఉన్న మూడు భారీ పెల్టోఫోరం చెట్లను మేము సురక్షితంగా మరో చోటుకి తరలించాం.
సుమారు 20 ఏళ్ల వయస్సు గల ఈ వృక్షాలను తొలగించకుండా, పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పంతో ఆధునిక పద్ధతుల్లో రీ-లొకేషన్ ప్రక్రియను చేపట్టాం.
డీసీపీ ట్రాఫిక్-1 పర్యవేక్షణలో, అటవీ శాఖ మరియు జీహెచ్ఎంసీ యూబీడీ విభాగాల సమన్వయంతో ఈ బృహత్తర కార్యక్రమం జరిగింది.
శాస్త్రీయ పద్ధతిలో కొమ్మలను కత్తిరించి, వేర్లకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుని, ఈ చెట్లను అల్వాల్ హిల్స్కు తరలించి పునఃప్రతిష్ఠించాం.
ఈ నిర్ణయం వల్ల అల్వాల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తొలగి ప్రయాణం సులభతరం కావడమే కాకుండా, పచ్చదనాన్ని కాపాడుకోగలిగాం.
అభివృద్ధి పనుల కోసం పచ్చని చెట్లను నరికివేయకుండా, వాటిని కాపాడుకుంటూ ముందుకు వెళ్లడమే మా ప్రాధాన్యత. మార్పిడి చేసిన ఈ మొక్కలు ఆరోగ్యంగా పెరిగేలా నిరంతరం పర్యవేక్షిస్తాం. పర్యావరణ హితమైన రహదారుల నిర్మాణానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం.
— జి. శంకర్ రాజు, ఏసీపీ, ట్రాఫిక్ తిరుమల్ గిరి విభాగం.
#sidhumaroju
Alwal










