“ప్రజల కోసం.. ప్రక్షాళన బాటలో శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
3

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త చెరువు పునరుజ్జీవన పనులు వేగంగా సాగుతున్నాయి. చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించే ప్రక్రియను ఆమె స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.

సాజిద్, ప్రేమ్, యాదగిరి, ఆదిత్య, శీను తదితరులతో కలిసి పనులను పరిశీలించిన ఆమె, స్థానికుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.

గుర్రపుడెక్క కారణంగా నీరు నిలిచిపోయి దోమలు ప్రబలే అవకాశం ఉండటంతో, పారిశుద్ధ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా, గుర్రపుడెక్కను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు.

పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటంలో నిరంతర కృషి అవసరమని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.

#sidhumaroju

Alwal