భారత్ అవాజ్ న్యూస్: ఈరోజు నల్లబెల్లి PACS వద్ద ట్రక్ షీట్లు ఇవ్వాలంటూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. 15 రోజులుగా సెంటర్లో నిల్వ ఉన్న మొక్కజొన్న బస్తాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ట్రాఫిక్ స్థంభించడంతో ఎస్సై సాయి ప్రసన్నకుమార్ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సెంటర్లో ఉన్న బస్తాలకు ట్రక్ షీట్లు ఇస్తామని PACS ప్రతినిధి మొగిలి తెలపడంతో రైతులు శాంతించారు…. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము










