నర్సంపేట మార్కెట్లో కేటీఆర్ పర్యటన….
భారత్ అవాజ్ న్యూస్ : ఈరోజు నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. నర్సంపేట చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. కేంద్రంలో జరుగుతున్న కొనుగోలు ప్రక్రియ, వేగవంతం చేయాలని అధికారులను కోరారు రైతులకు కల్పిస్తున్న కనీస వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా జాప్యం జరగకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు… దుగ్గొండి మండలం రిపోర్టర్ జీ రాము…










