మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా గార్మెంటరీ యూనిట్‌కు శంకుస్థాపన

0
2

ఉపాధి అవకాశాల విస్తరణకు తోడ్పడే విధంగా రూ. 7 కోట్లు 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే గార్మెంటరీ యూనిట్‌కు గంగాపురి వద్ద శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ గార్మెంటరీ యూనిట్ ద్వారా స్థానిక మహిళలు, యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి అవకాశాలు సృష్టించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ యూనిట్ స్థాపనతో మంథని పరిసర ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం కలుగుతుందని, ముఖ్యంగా మహిళా స్వయం ఉపాధి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.