వరంగల్: అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్లో మహిళా రైతుల పడిగాపులు
భారత్ ఆవాస్ న్యూస్: 8 మే నేడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్లో మహిళా రైతులు పడిగాపులు కాస్తున్నారు..
జాంబవ రైతు ఉత్పత్తిదారుల సంఘం నిర్వహణలో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రంలో మక్కలు కాంటాలు వేసిన రైతులు బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ కోసం అర్ధరాత్రి వరకు వేచి ఉన్నారు….
మహిళా రైతులు కూడా పోలీస్ స్టేషన్లో తిండి, నిద్రాహారాలు మానుకొని ఎదురు చూశారు. తీరా నిర్వాహకులు చేతులెత్తేసి వెళ్లిపోయారు. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము










