దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక అడుగు పడబోతోంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన 2027 జనాభా గణన ప్రక్రియ ప్రారంభమైంది. దీనిపై చింతూరు తహసీల్దార్ సయ్యద్ హుస్సేన్ గారు ప్రజలకు కీలక విన్నపం చేశారు.మే 1 నుండి మే 30 వరకు ఇంటి జాబితా తయారీ జరుగుతుంది తొలిసారిగా ఈ గణన పూర్తి డిజిటల్ పద్ధతిలో నిర్వహించబడుతోంది కావున మీరు ఇచ్చే సమాచారం అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది. దీనివల్ల ప్రభుత్వ పథకాలకు ఎటువంటి ఆటంకం కలగదు.అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ కుటుంబ వివరాలను ఖచ్చితంగా తెలియజేయండి.ప్రతి కుటుంబం అందించే సమాచారం ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు ఎంతో కీలకం. అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి అందరూ అధికారులకు సహకరించాలి అని పత్రిక ప్రకటనలో తెలిపారు.
# YADAGIRI









