ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..|

0
0

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భారీ స్థాయిలో పరిపాలన ప్రక్షాళన జరిగింది. పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ, మరికొందరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు (జీవో ఆర్టీ నెం.1539) జారీ చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

 

విద్యా, పర్యాటక, రవాణా, గృహనిర్మాణం వంటి కీలక శాఖలకు కొత్త అధిపతులు రాగా, కొందరు సీనియర్ అధికారులను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించడం గమనార్హం. మొత్తం 22 మంది అధికారులకు సంబంధించిన బదిలీలు, నియామకాలు, అదనపు బాధ్యతల వివరాలు కింది విధంగా ఉన్నాయి.