సికింద్రాబాద్ : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ గంజాయి స్మగ్లింగ్ను రైల్వే పోలీసులు భగ్నం చేశారు.
జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసుల సంయుక్త తనిఖీల్లో ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి సుమారు రూ.8.95 లక్షల విలువైన 17.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితులు ఒడిశా రాష్ట్రం నుంచి గుజరాత్కు రైలు మార్గం ద్వారా గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని తనిఖీ చేయగా, వారి సామాన్లలో భారీ మొత్తంలో గంజాయి బయటపడింది.
వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల రైల్వే మార్గాలను వినియోగిస్తూ అంతరాష్ట్ర స్థాయిలో గంజాయి అక్రమ రవాణా పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో నిందితుల నేపథ్యం, గంజాయి సరఫరా నెట్వర్క్, వీరి వెనుక ఉన్న ముఠా వివరాలపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
రైల్వే స్టేషన్లు, రైళ్లలో తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ ఉండదని పోలీసులు స్పష్టం చేశారు.
#Sidhumaroju










