తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక ప్రకటన విడుదల చేశారు.
ప్రజా జీవితంలో తాను ఎప్పుడూ చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని పాటిస్తూ వచ్చాను.
తన రాజకీయ జీవితంపై ఎలాంటి మచ్చలేదని, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది.
రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేని వారు ఇప్పుడు కుటుంబ సభ్యులు, పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపులో భాగమే.
గ్రామీణ స్థాయి నుంచి ఎదిగి కార్పొరేటర్గా, అక్కడి నుంచి ప్రజల మద్దతుతో కేంద్ర మంత్రిగా ఎదిగిన బీసీ నాయకుడి ఎదుగుదలను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ సభకు ముందు తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు తెరపైకి తెస్తున్నారు.
నిజం ఏమిటో న్యాయస్థానమే తేలుస్తుందని, ప్రతి కుట్రను కాలమే బయటపెడుతుంది – బండి సంజయ్









