“కనకారెడ్డి వర్ధంతి… భావోద్వేగంగా నివాళులర్పించిన అభిమానులు.|

0
7

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప్రజానాయకుడు, దివంగత శ్రీ కనకా రెడ్డి గారిని ఆయన 7వ వర్ధంతి సందర్భంగా ఘనంగా స్మరించుకున్నారు.

ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన ఆయన సేవా భావం, సాధారణ జీవనం, ప్రజల పట్ల చూపిన అంకితభావం నేటికీ మల్కాజ్‌గిరి ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని నాయకులు, అభిమానులు పేర్కొన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండే కనకా రెడ్డి గారు రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. ఆయన చూపిన మార్గంలోనే ప్రజాసేవ కొనసాగించాలని పలువురు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

“సాధారణతలో మహోన్నతతను చూపించిన నాయకుడు కనకా రెడ్డి … ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది” అంటూ పలువురు భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు.

#Sidhumaroju

Alwal