ఎన్టీఆర్ జిల్లా, నందిగామ: చందర్లపాడు మండలం,చింతలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ లో 1994-97 విద్యా సంవత్సరంలో ఎస్.ఎస్.సి వరకు చదివిన విద్యార్థుల ఆత్మీయ కలయిక జరిగినది.ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికలో ఎక్కడెక్కడ స్థిరపడినవారు తమ కుటుంబ సమేతంగా అందరూ కలుసుకొని చదువుకున్న చిన్ననాటి గత స్మృతులు గుర్తుచేసుకొని ఆనందోత్సవాల మధ్య పూర్వ విద్యార్థుల కలయిక జరిగింది.
ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ కలయికలో తమతో పాటు చదువుకున్న కొంతమంది స్నేహితులు చనిపోవడం చాలా బాధాకరమని వాళ్లని స్మరించుకోవడం జరిగింది.1994-97 లో టీచర్ గా పని చేసిన బొందలపాటి అప్పారావు , జూలూరు చంద్రమౌలేశ్వరరావు,జంధ్యాల రామస్వామి శాస్త్రి ,జంధ్యాల రాజ్యలక్ష్మి ను ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది.










