మదనపల్లి: టిప్పు సుల్తాన్ మైదాన అభివృద్ధి పనుల పరిశీలన.

0
1

మదనపల్లె పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే షాజహాన్ భాషా గురువారం ఉదయం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, స్థానికులకు ఉపయోగపడే విధంగా మైదానాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.