అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రంలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. గురువారం రాత్రి స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో గుంపులుగా తిరుగుతూ పాదాచారులు, ద్విచక్ర వాహనదారులపై దాడులు చేస్తున్నాయని, వాహనదారులను వెంబడిస్తున్నాయని, చిన్నారులు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారని వాపోయారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.










