బ్లడ్ బ్యాంకుల్లో రక్త కొరత లేకుండా చర్యలుతీసుకోవాలి: భాస్కర్.

0
4

అన్నమయ్య జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి వేంపల్లి భాస్కర్ సోమవారం సూచించారు. మదనపల్లిలోని ప్రభుత్వ బ్లడ్ బ్యాంకును తనిఖీ చేసి, రక్త నిల్వలు, రికార్డులను పరిశీలించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల కనీసం 24 రక్తదాన శిబిరాలు నిర్వహించాలని, అక్రమ రక్త వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల్లో రక్తదానంపై అవగాహన పెంచాలని తెలిపారు.