Saraswathi antya puskharalu

0
4

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం వద్ద, ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు అత్యంత వైభవంగా జరగనున్న “సరస్వతి అంత్య పుష్కరాల” మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు.

దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు, ఆలయ అర్చక బృందం, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు ముఖ్యమంత్రి గారికి వేదాశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య గారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్యర్ గారు, కమిషనర్ శ్రీ హనుమంతరావు గారు, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఈవో శ్రీ మహేష్ గారు పాల్గొన్నారు.