రాబోయే 4 రోజులు నిప్పుల కొలిమే: పీవో శుభం నోక్వాల్

0
5

చింతూరు ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) శుభం నోక్వాల్ గురువారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు.వాతావరణం దారుణంగా మారే అవకాశం ఉన్నందున ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.పోలవరం జిల్లా చింతూరులో రాబోయే నాలుగు రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు (Heat waves) వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బుధవారం 44 డిగ్రీలు నమోదయ్యాయి ముఖ్యంగా ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఏదైనా అత్యవసరమైన పని ఉంటే తప్ప ఆ సమయాల్లో ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు (గొడుగు, మంచి నీళ్లు, తలకి రుమాలు వంటివి) తీసుకోండి ప్రాణం కంటే ఏ పనీ ఎక్కువ కాదు కాబట్టి ఎండ తీవ్రత తగ్గేవరకు కాస్త ఓపిక పట్టండి, సురక్షితంగా ఉండండి అని పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకి తెలియజేశారు.

# Yadagiri