రత్నాపురంలో కేంద్ర పథకాలపై 3 రోజుల ప్రత్యేక డ్రైవ్

0
6

చింతూరు గ్రామపంచాయతీ రత్నాపురం లో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి గిరిజన ప్రజలకు మూడు రోజులపాటు చింతూరు ఐటీడీఏ పీవో శుభంనొక్వల్ ఆదేశానుసారం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రత్యేక నోడల్ అధికారి అనిల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అయిన కిసాన్ సన్మానిధి యోజన, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి అనేక ప్రభుత్వ పథకాలు గిరిజనులకు అవగాహన లేక సద్వినియోగం చేసుకోలేకపోతుండటం వలన వీటిని సద్వినియోగపరచకోవడానికి చింతూరు ఐటీడీఏ పీవో గారు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించడం జరుగుతుంది. కావున రత్నాపురం గ్రామస్తులందరూ సద్వినియోగ పరుచుకోగలరని నోడల్ అధికారి ఈ మేరకు పిలుపు ఇవ్వడం జరిగింది.