మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కనజిగూడ డివిజన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు అమృత నివాసంలో ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో పాటు, ఇంట్లోని సామాగ్రి, సర్వస్వం బూడిదయ్యాయి. చేతికందిన సర్వస్వం కోల్పోవడంతో అమృత కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు లోనైంది.
ఈ ఘోర ప్రమాద విషయం తెలియగానే బిఆర్ఎస్ నాయకులు అనిల్ కిశోర్ గౌడ్ తక్షణమే స్పందించారు. ఆయన వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని, కాలిపోయిన ఇంటిని పరిశీలించారు. బాధితురాలైన అమృత గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ మరియు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
బాధిత కుటుంబం ఉన్న పళంగా రోడ్డున పడటంతో, అనిల్ కిశోర్ గౌడ్ మానవత్వంతో స్పందించి వారి అత్యవసర ఖర్చుల నిమిత్తం రూ. 5000 నగదును తక్షణ సాయంగా అందజేశారు.
ప్రభుత్వం మరియు ప్రభుత్వం నుండి కూడా తగిన నష్టపరిహారం అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రభాకర్, విజయ్ శేఖర్, రాజు తదితరులు పాల్గొని బాధితులకు తమ సానుభూతిని తెలియజేశారు.
#sidhumaroju
Alwal










