మదనపల్లెకు చెందిన రిటైర్డ్ ఉద్యోగుల భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ ఏపీఎస్ఈబీ యూనియన్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి చిన్నప్పతో పాటు పలువురు శుక్రవారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
మదనపల్లెకు చెందిన రామకృష్ణారెడ్డి నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల విలువైన తమ భూమిని ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. మదనపల్లెలో ఫైళ్ల దగ్ధం కేసుతో పాటు పలు భూకబ్జా కేసుల్లో కూడా అతడు నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. తమ భూమిని విడిపించి న్యాయం చేయాలని అధికారులను కోరారు.










