రుషికొండ భవనాలపై కీలక ప్రకటన: వినియోగంపై ప్రతిపాదనలు|

0
0

రుషికొండ భవనాలను ఇంకా ఎవరికీ కేటాయించలేదన్న ప్రభుత్వం

పర్యాటక వినియోగంపై ప్రతిపాదనలు కోరిన ఏపీటీడీసీ

ఈ అంశంపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ

లీజు వ్యవహారంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు వెల్లడి

విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన వివాదాస్పద భవనాలను ఇప్పటివరకూ ఎవరికీ కేటాయించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ భవనాలను పర్యాటక సంబంధిత కార్యకలాపాలకు ఏ విధంగా వినియోగించాలనే అంశంపై ఆసక్తి గల సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) వెల్లడించింది.

 

ఈ భవనాలను మరియు అక్కడ ఉన్న ఖాళీ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా మూడో పక్షానికి లీజుకు ఇవ్వకుండా చూడాలని కోరుతూ జనసేన కార్పొరేటర్ పీవీఎన్ఎన్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గ ఉపసంఘం సమీక్షించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.