మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వీధుల్లో వదిలివేయబడిన వాహనాలపై పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు.
మొత్తం 446 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని త్వరలో వేలం వేయనున్నట్లు వెల్లడించారు. వీటిలో ఫోర్ వీలర్లు, త్రీ వీలర్లు, టూ వీలర్లు ఉన్నాయి.
స్వాధీనం చేసుకున్న వాహనాలను సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్క్వార్టర్స్, అంబర్పేట్లో భద్రపరిచారు. అలాగే ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన ఫోర్ వీలర్, త్రీ వీలర్ వాహనాలను ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పూలింగ్ పాయింట్లో ఉంచారు.
సంబంధిత చట్టాల ప్రకారం ఈ వాహనాలను వేలం వేయాలని మల్కాజిగిరి పోలీసులు నిర్ణయించారు.
వాహనాల పూర్తి వివరాలను మల్కాజిగిరి పోలీస్ అధికారిక వెబ్సైట్ లో “Citizen Services – Abandoned Vehicles – 2026” విభాగంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తమ వాహనం అందులో ఉందేమో యజమానులు పరిశీలించుకోవాలని సూచించారు.
వాహనాలకు సంబంధించిన యజమానులు లేదా హైపోతెకేషన్ వ్యక్తులు తగిన పత్రాలతో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి ఆరు నెలల లోపు DCP CAR Headquarters, మల్కాజిగిరి, అంబర్పేట్ కార్యాలయాన్ని సంప్రదించాలని పోలీసులు తెలిపారు.
ఆధారాలు పరిశీలించిన అనంతరం వాహనాలను యజమానులకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం 8008338535, 8712662661 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
#sidhumaroju
Alwal










