“రైతు గోసకు బీజేపీ భరోసా”

0
11

హైదరాబాద్ : రైతు గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్‌చందర్ రావు, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి, హరీష్ రావు, నాయకులు పాల్వాయి గోవర్ధన్, బైతి సుభాష్ రెడ్డి తదితరులతో కలిసి మూడు రోజుల బస్ యాత్ర కొనసాగుతోంది.

ఈ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల మాణిక్య రెడ్డి, జే. సురేందర్ రెడ్డి, వై. సుదర్శన్ రెడ్డి, గిరివర్ధన్ రెడ్డి, పిట్ల నాగేశ్, సూర్య, రాజిరెడ్డి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

ఈరోజు భువనగిరి మరియు జనగామ ప్రాంతాల్లో బీజేపీ నాయకులు ప్రజలను కలుసుకుని రైతుల సమస్యలు, సాగునీటి ఇబ్బందులు, పంటల మద్దతు ధరలు తదితర అంశాలపై చర్చించారు.

నిన్న వికార్‌బాద్ మరియు గజ్వేల్ ప్రాంతాల్లో కూడా యాత్ర నిర్వహించారు.

అదేవిధంగా ఎమ్మెల్సీలు కొమురయ్య , అంజి రెడ్డి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

#Sidhumaroju