మదనపల్లె జిల్లా సాధన కోసం గతంలో నిరసనల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, సీనియర్ నేత రాటకొండ మధుబాబు, పఠాన్ ఖాదర్ ఖాన్ తదితరులు సోమవారం మదనపల్లె కోర్టులో వాయిదాకు హాజరయ్యారు. అప్పట్లో జిల్లా కోసం పోరాడితే అప్పటి ప్రభుత్వం తమపై అక్రమ కేసులు బనాయించిందని, నాటి నుంచి నేటి వరకు ప్రతి నెలా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.










