వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసిపట్టాలి: జిల్లా కలెక్టర్.

0
4

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, రానున్న వర్షాలను సమర్థవంతంగా వినియోగించుకుని జల వనరులను పెంచాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లిలో ఇరిగేషన్, డ్వామా అధికారులతో నిర్వహించిన సమీక్షలో, ఈ ఏడాది 5 శాతం అదనపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున వర్షపు నీటిని చెరువులు, కుంటల్లో నిల్వ చేయాలని సూచించారు. వృథా ప్రవాహాలను రిజర్వాయర్లకు మళ్లించాలని, ట్యాంక్ టు ట్యాంక్ కనెక్టివిటీ ఛానల్స్ అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన తెలిపారు.