పుంగనూరు: ప్రమాదంలో గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి

0
6

అన్నమయ్య జిల్లా, సోమల మండలం, రాంపల్లి గ్రామానికి చెందిన రామ్ చరణ్ (21) ఈనెల 19న ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, ఫిరింగులు గుట్ట సమీపంలో టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని సదుం ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాంచరణ్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని శవ పరీక్షకు పంపడం జరిగింది# కొత్తూరు మురళి.