మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్డులో శుక్రవారం ఉదయం ఒక చిన్నపాటి ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక మినీ బస్సు టైరు అకస్మాత్తుగా పంక్చర్ అవ్వడంతో ఈ ఘటన జరిగింది.టైరు పేలడంతో డ్రైవర్ తన నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపైనే బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులలో 9 మందికి గాయాలయ్యాయ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అదే దారిలో వస్తున్న గుప్తా ప్రైవేటు ట్రావెల్ బస్సు ఎక్కించి, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
# Yadagiri










