తల్లికి వందనం కోసం NPCI లింక్ చేయాలి

0
2

తల్లికి వందనం పథకం ప్రయోజనాల కోసం అర్హులైన ఎస్సీ ఇంటర్ విద్యార్థులు తమ బ్యాంకు/పోస్టల్ ఖాతాలను జూన్ 10లోగా NPCIతో అనుసంధానం చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి ఎం. అన్నపూర్ణమ్మ సోమవారం తెలిపారు. ఖాతా లేని వారు కొత్త ఖాతా తెరవాలని, ఆధార్, లింక్ మొబైల్ నంబరుతో సచివాలయాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు. NPCI లింక్ లేకుంటే పథకం లబ్ధి అందకపోవచ్చని హెచ్చరించారు.

#BOIENA RAJESH