పుంగనూరు: పూడికతీత పనులను సమగ్రవంతంగా చేయాలి: బీజేపీ

0
2

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని కౌండిన్య నది కాలువ పూడికతీత పనులను సమగ్రంగా చేపట్టాలని బిజెపి నాయకులు అయూబ్ ఖాన్ సోమవారం డిమాండ్ చేశారు. సంవత్సర కాలంలో మూడుసార్లు మట్టి తీసినా, తిరిగి ఆ మట్టి వంకలో పడి పూడిపోతోందని, ఇది ప్రజాధనాన్ని వృధా చేయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మున్సిపల్ ప్రత్యేక అధికారి వెంటనే పనులను పరిశీలించి, అవినీతిపై విచారణ చేపట్టాలని కోరారు# కొత్తూరు మురళి.