మదనపల్లెలోని సొసైటీ కాలనీలో సోమవారం సాయంత్రం తీవ్ర వివాదం నెలకొంది. ప్రభుత్వ మున్సిపల్ బోరుకు 10 మీటర్ల లోపే ప్రైవేట్ ఆసుపత్రి యజమాని మరో బోరు వేయడానికి ప్రయత్నించగా, నిబంధనలకు విరుద్ధమని స్థానికులు అడ్డుకున్నారు. కొత్త బోరుతో భూగర్భ జలాలు తగ్గి నీటి ఎద్దడి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసిన కాలనీవాసులు, పనులు నిలిపివేయాలని మున్సిపల్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.









