గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతూ పట్టుబడిన ఇద్దరు నిందితులు.. పరారీలో మరో ఇద్దరు

0
0

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా,విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పట్టుకుని,వారి వద్ద నుంచి గంజాయి, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ పోలీసు సిబ్బందితో కలిసి బీ పవర్ హౌస్ టర్నింగ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా,బోరే కిషన్ (26), రామగుండం, లింగంపల్లి శ్రావణ్ కుమార్ (26), ఇందిరమ్మ కాలనీ, ఎన్టీపీసీ ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, గంజాయిని కొనుగోలు చేసి కొంత వినియోగించడంతో పాటు మిగిలిన గంజాయిని ఎన్టీపీసీ ప్రాంతంలో కూలీ పనులు చేసే ఇతర రాష్ట్రాల కార్మికులకు విక్రయించేందుకు తీసుకువచ్చినట్లు ఒప్పుకున్నారు.పంచుల సమక్షంలో నిర్వహించిన తనిఖీల్లో వారి వద్ద ఉన్న బ్యాగులో 748 గ్రాముల గంజాయి లభ్యమైంది.స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.37,500/- గా అంచనా వేశారు. అలాగే నేరానికి ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమరవాణాను అడ్డుకుని, చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న ఎన్టీపీసీ ఎస్ఐ టి.ఉదయ్ కిరణ్ మరియు పోలీసు సిబ్బందిని ఏసీపీ గోదావరిఖని ఎం.రమేష్, రామగుండం సీఐ కృష్ణకుమార్తో పాటు ఉన్నతాధికారులు అభినందించారు.