మదనపల్లి: కరెంట్ షాక్‌తో బాలుడికి తీవ్ర గాయాలు.

0
0

మదనపల్లెలోని అమ్మచెరువుమిట్టలో మంగళవారం విష్ణు (7) అనే బాలుడు కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. రామసముద్రం మండలం కాప్పల్లికి చెందిన ఈ బాలుడు తన మేనమామ ఇంటికి వచ్చినప్పుడు, బుధవారం పిల్లలతో ఆడుకుంటుండగా బంతి మిద్దెపై ఉన్న రేకులపై పడింది. దాన్ని తెచ్చేందుకు రేకులపైకి ఎక్కగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే అతన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.